News March 16, 2025
నా బలం నా పేరులో లేదు: మోదీ

‘నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల ప్రజల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలో ఉంది’ అని ప్రధాని మోదీ చెప్పారు. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దేశ ప్రజలందరికీ ఇచ్చినట్లేనని తెలిపారు. ఒక ఉద్దేశ్యంతో గొప్ప శక్తి తనను ఇక్కడి(భూమి)కి పంపిందని, తానెప్పుడూ ఒంటరి కాదన్నారు. బాల్యంలో తన తండ్రి టీ షాపు వద్దకు వచ్చిన వారి నుంచి చాలా నేర్చుకునేవాడినన్నారు. వాటినే ప్రజా జీవితంలో అప్లై చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
News January 1, 2026
హరిహరులను కొలిచేందుకు నేడే సరైన సమయం

నేడు హరిహరులను కలిపి పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈరోజు త్రయోదశి తిథి. ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒకే రోజున అటు హరి, ఇటు హర.. ఇద్దరినీ పూజించే అరుదైన అవకాశం కలిగింది. భక్తులు ఈ శుభదినాన విష్ణు సహస్రనామ పారాయణతో పాటు శివాభిషేకం చేయడం అభీష్ట సిద్ధి పొందుతారు’ అని అంటున్నారు.
News January 1, 2026
జోగి రమేశ్కు రూ.కోటి ముడుపులు?

AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులపై సప్లిమెంటరీ-2 ఛార్జ్షీటును సిట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ₹కోటికిపైగా ముడుపులు రమేశ్కు ఇచ్చారని సిట్ పేర్కొన్నట్లు తెలిసింది. 2021-23 మధ్య పలు విడతల్లో ఇచ్చారని సమాచారం. అద్దేపల్లి సోదరులు, రమేశ్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో 17 మంది నిందితులకు విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.


