News March 16, 2025

గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

image

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.

Similar News

News March 17, 2025

‘రూ’ అక్షరాన్ని నిర్మలా సీతారామన్ కూడా వాడారు: స్టాలిన్

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం గతంలో తమిళ ‘రూ’ సింబల్ ని వాడారని CM స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించిందని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. తమ మాతృభాషను రక్షించుకోవడానికే NEPని వ్యతిరేకిస్తున్నామని, భాషపై గందరగోళం సృష్టించేవారు కేంద్రమంత్రి చర్య పైనా మాట్లాడాలని అన్నారు. బడ్జెట్ సమయంలో ‘రూ’ అక్షరం వాడటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

News March 17, 2025

భారత్ ప్రగతి అద్భుతం: బిల్‌గేట్స్

image

ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని బిల్‌గేట్స్ అన్నారు. భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో దేశంపై ప్రశంసలు కురిపించారు. వాతావరణం, వ్యవసాయం, చీడపీడల బెడద తగ్గించడంలో ఏఐ సహాయం చేస్తుందన్నారు. గేట్స్ ఫౌండేషన్ 25వార్షికోత్సవానికి భారత్ అనువైన ప్రదేశమని తెెలిపారు. ఇండియాలో శాస్త్రవేత్తలు, అధికారులతో బిల్ గేట్స్ సమావేశమయ్యే అవకాశముంది.

News March 17, 2025

పెళ్లైన మగవారు బరువు ఎందుకు పెరుగుతారంటే?

image

వివాహం తర్వాత పురుషులు అనూహ్యంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లైన ఆనందంలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. బాధ్యతలు పెరిగి జిమ్‌కు వెళ్లే సమయం ఉండదు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగిపోతారు. హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరో కారణం.

error: Content is protected !!