News March 16, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రోజున నిజాంసాగర్లోని హాసన్పల్లి, పాల్వంచలోని ఎల్పుగొండ, 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డోంగ్లి, జుక్కల్ 41.4, మద్నూర్లోని మేనూర్ 41.2, పిట్లం 41.1, మద్నూర్లోని సోమూరు, నాగిరెడ్డిపెట్, ఎల్లారెడ్డిలోని మచపూర్లో 40.9,బిచ్కుంద, దోమకొండ 40.7, కామారెడ్డిలోని కలక్టరేట్లో, గాంధారి, సర్వపూర్ 40.5°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News September 18, 2025
కోట: Way2News కథనానికి స్పందన

కోట ఆర్టీసీ బస్టాండ్లో పదుల సంఖ్యలో <<17749380>>కుక్కలు సంచరిస్తూ<<>> ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు గురువారం Way2Newsలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన కోట MPDO దిలీప్ కుమార్.. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
News September 18, 2025
NGKL: ఎస్పీ పేరుతో ఫేక్ అకౌంట్..

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ సృష్టించారు. సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ అకౌంట్ ద్వారా మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మెసేజ్ వస్తే స్పందించొద్దని ఎస్పీ కోరారు.
News September 18, 2025
నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.