News March 16, 2025
నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.
Similar News
News January 9, 2026
మేడారం దారుల్లో 2 కి.మీకో చెక్పోస్ట్: ఎస్పీ

మేడారంలో క్రౌడ్, క్రైం కంట్రోల్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మీడియాతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. మల్టీ జోన్ -1ఐజీ పర్యవేక్షణలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, 12 వేల మంది సిబ్బంది పని చేస్తారని చెప్పారు. మేడారం-పస్రా, మేడారం -తాడ్వాయి రూట్, ప్రధాన దారుల్లో ప్రతీ రెండు కిలోమీటర్లకు పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.
News January 9, 2026
ట్రంప్ మాస్టర్ ప్లాన్.. గ్రీన్లాండ్ ప్రజలకు డాలర్ల వల?

గ్రీన్లాండ్ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ టీమ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అక్కడి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల వరకు ఆఫర్ చేయాలని వైట్హౌస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే COFA ఒప్పందం ఆప్షన్ను పరిశీలిస్తున్నారట. దీని ప్రకారం.. గ్రీన్లాండ్లో US ఆర్మీ కార్యకలాపాలు కొనసాగించుకుంటుంది. దీనికి ప్రతిఫలంగా USతో గ్రీన్లాండ్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు.
News January 9, 2026
VJA: దైవ దర్శనాల పేరుతో టోకరా.. పోలీసులకు ఫిర్యాదు!

మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర పేరు చెప్పి దైవ దర్శనాల సాకుతో కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్లకు పాల్పడ్డారు. భక్తులను నమ్మించి నగదు వసూలు చేస్తున్న విషయం బాధితుల ద్వారా ఆయన దృష్టికి రావడంతో రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సహాయ కార్యదర్శి ప్రసాద్ శుక్రవారం పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసపూరిత వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.


