News March 16, 2025
పింఛన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది. ఇందులో ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ఈ పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.
Similar News
News March 17, 2025
‘రూ’ అక్షరాన్ని నిర్మలా సీతారామన్ కూడా వాడారు: స్టాలిన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం గతంలో తమిళ ‘రూ’ సింబల్ ని వాడారని CM స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించిందని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. తమ మాతృభాషను రక్షించుకోవడానికే NEPని వ్యతిరేకిస్తున్నామని, భాషపై గందరగోళం సృష్టించేవారు కేంద్రమంత్రి చర్య పైనా మాట్లాడాలని అన్నారు. బడ్జెట్ సమయంలో ‘రూ’ అక్షరం వాడటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
News March 17, 2025
భారత్ ప్రగతి అద్భుతం: బిల్గేట్స్

ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని బిల్గేట్స్ అన్నారు. భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో దేశంపై ప్రశంసలు కురిపించారు. వాతావరణం, వ్యవసాయం, చీడపీడల బెడద తగ్గించడంలో ఏఐ సహాయం చేస్తుందన్నారు. గేట్స్ ఫౌండేషన్ 25వార్షికోత్సవానికి భారత్ అనువైన ప్రదేశమని తెెలిపారు. ఇండియాలో శాస్త్రవేత్తలు, అధికారులతో బిల్ గేట్స్ సమావేశమయ్యే అవకాశముంది.
News March 17, 2025
పెళ్లైన మగవారు బరువు ఎందుకు పెరుగుతారంటే?

వివాహం తర్వాత పురుషులు అనూహ్యంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లైన ఆనందంలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. బాధ్యతలు పెరిగి జిమ్కు వెళ్లే సమయం ఉండదు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగిపోతారు. హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరో కారణం.