News March 17, 2025

ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం. 

image

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Similar News

News March 17, 2025

జలుమూరు : ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

News March 17, 2025

VKB: పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని సైబర్ నేరగాళ్ల బురిడీ

image

పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లికి చెందిన యూనుస్ భార్య స్నాప్ చాట్ చూస్తున్న క్రమంలో ఓ లింకును ఓపెన్ చేశారు. పెన్సిల్ లోడ్ మీ వద్దకు వస్తుందని.. అవి ప్యాక్ చేస్తే నెలకు రూ.30 వేల వేతనం ఇస్తామంటూ నమ్మబలికారు. ఐడీ కార్డు ఇతరత్రా వాటికోసం రూ.13వేలు చెల్లించారు. కాగా, మోసపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 17, 2025

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఎక్కడా?: వైసీపీ

image

AP: అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానని ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గెలిచాక మాట మరచిపోయారని వైసీపీ విమర్శించింది. దేశంలో అన్నిరాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా పెరిగాయంది. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంధన ధరల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదని X వేదికగా వైసీపీ ప్రశ్నించింది.

error: Content is protected !!