News March 17, 2025
కామారెడ్డి: నేడు విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్సీ, జిల్లా అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. NPDCL పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉ.10 గంటల నుంచి 1:00 వరకు అలాగే జిల్లా జిల్లాస్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 17, 2025
అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 17, 2025
RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్కు యాపిల్, శామ్సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.
News March 17, 2025
బీసీ ఎమ్మెల్యేలతో మంత్రుల సమావేశం

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలన్నారు.