News March 17, 2025

జుక్కల్: హోలీ ఆడి, స్నానానికి వెళ్లి శవమై తేలాడు

image

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన ప్రకాష్ దేవాడ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ నెల 14న హోళీ ఆడి తన తోటి మిత్రులతో దేశ్ముక్ చెరువులో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని ఈ నెల 16న శవమై తేలినట్లు తల్లి చందాబాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.

Similar News

News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట కాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలి కాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.

News March 17, 2025

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: అడిషనల్ కలెక్టర్లు

image

మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకాలలోనైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధికారులు పాల్గొన్నారు.

News March 17, 2025

నంద్యాల జిల్లాలో 394 మంది గైర్హాజరు

image

నంద్యాల జిల్లా పరిధిలో సోమవారం తొలిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 394 మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు DEO జనార్దన్ రెడ్డి తెలిపారు.  మొత్తం 24,907 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 24,513 మంది పరీక్షలు రాశారని డీఈవో చెప్పారు.

error: Content is protected !!