News March 17, 2025

నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

image

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News March 17, 2025

పార్వతీపురం: పది పరీక్షలకు 10,308 మంది హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో తొలిరోజు 10వ తరగతి పరీక్షలకు 10,308 మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 10,355 మంది విద్యార్థులకు గాను 10,308 మంది విద్యార్థులు హాజరుకాగా 47 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పట్టణంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.

News March 17, 2025

 NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు మొత్తం 831 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, నేటి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.

News March 17, 2025

PPM: పదో తరగతి పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం ఆర్.సి.యం. సెయింట్ పీటర్స్ (ఇ.యం) హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను, పరీక్షా నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!