News March 17, 2025
నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News March 17, 2025
200 ఏళ్లనాటి పనస చెట్టును చూశారా?

TNలోని కడలూరులో పన్రుటి ప్రాంతం పనస పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 4వేల మందికిపైగా రైతులు 800 హెక్టార్లలో వీటిని పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 200 ఏళ్లనాటి పనస వృక్షం ఫొటోను ఓ ఫారెస్ట్ అధికారి షేర్ చేస్తూ ఇది ఏటా 200 పండ్లు అందిస్తోందని తెలిపారు. కాగా, ఫైబర్, ఖనిజాలతో కూడిన పోషకాహారాలు పనస పండులో మెండుగా ఉండటంతో వీటి పెంపకానికి తమిళనాడు ప్రభుత్వం ‘జాక్ఫ్రూట్ మిషన్’ను ప్రారంభించింది.
News March 17, 2025
జగిత్యాల: ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 35 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వాటిని ఆలస్యం చేయకుండ పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవోలు మధు సుధన్, జీవాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News March 17, 2025
అనకాపల్లి: ఎస్పీ పరిష్కార వేదికకు 40 ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 40 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా అదనపు ఎస్పీ మోహన రావు స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులకు తక్షణ విచారణ జరిపి సత్వర పరిష్కారం కల్పించాలన్నారు.