News March 17, 2025
ఎన్టీఆర్: ఈ మండలాల ప్రజలు కాస్త జాగ్రత్త

జిల్లాలో రేపు సోమవారం 8 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ 40.5, రూరల్ 40.4, వీరుల్లపాడు 40.8, నందిగామ 40.9, జి.కొండూరు 40.4, చందర్లపాడు 41, ఇబ్రహీంపట్నం 40.7, కంచికచర్ల 40.9 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
Similar News
News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
News March 17, 2025
పాపం బామ్మ! రూ.20కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ముంబైలో 86ఏళ్ల బామ్మ డిజిటల్ అరెస్టు బాధితురాలిగా మారారు. 2024 DEC 26 నుంచి MAR 3 వరకు ఏకంగా రూ.20.25 కోట్లు మోసపోయారు. ఆధార్, వ్యక్తిగత సమాచారంతో వేరెవరో బ్యాంకు A/C తెరిచి చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ఈ కేసులో కుమార్తెనూ అరెస్టు చేస్తామని బెదిరించారు. సాయపడాలని కోరడంతో డబ్బు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్టు గ్రహించిన ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 17, 2025
శ్రీసత్యసాయి: పదో తరగతి పరీక్షలకు 210 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షలలో మొదటి రోజు పరీక్షలో 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పెనుకొండ డివిజన్లో 129 మంది, ధర్మవరం డివిజన్లో 81 మంది గైర్హాజరు అయ్యారన్నారు.