News March 17, 2025
పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పెద్దకొత్తపల్లి మండలం పరిధి దేవుని తిరుమల పూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలానికి చెందిన పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాజు అతడి భార్య, కూతురు అనూషతో కలిసి వనపర్తి నుంచి బైక్పై వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా అనూష అక్కడికక్కడే చనిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2025
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గొప్పతనం ఇదే..

TG రాజకీయ, సాంఘిక చైతన్యానికి మరోపేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, నిజాం వ్యతిరేక ఉద్యమ నేతగా ఆయన సుపరిచితుడు. ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అన్న నిందను సవాల్గా తీసుకొని 354 కవులతో ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథం ప్రచురించారు. గోల్కొండ పత్రికనూ నడిపారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు వంటి పుస్తకాలు రాశారు.
News March 17, 2025
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. పుట్టపర్తి అర్బన్ పరిధిలోని ఎనుములపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి భద్రత ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, కేంద్రాలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు.
News March 17, 2025
ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, విజయ్ కుమార్, పీడీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.