News March 17, 2025

పాయకరావుపేట: పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

image

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎటువంటి భయాందోళనలు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ట్విట్టర్ ద్వారా విద్యార్థులకు సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 18, 2026

ట్విస్ట్ అంటే ఇది.. BJPకి షిండే షాక్ ఇస్తారా?

image

BMC ఫలితాల్లో ఏ సింగిల్ పార్టీకీ మెజారిటీ లేదు. 29 సీట్లు గెలిచిన మహాయుతిలోని షిండే సేన ఇప్పుడు కింగ్‌మేకర్‌గా మారింది. దీంతో మేయర్ పీఠమే లక్ష్యంగా ఆయన తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించారు. 114 మార్కు చేరాలంటే BJPకి షిండే సపోర్ట్ తప్పనిసరి. ప్రతిపక్షాలన్నీ కలిస్తే మెజారిటీకి 8 సీట్ల దూరంలోనే ఉన్నాయి. అందుకే హార్స్ ట్రేడింగ్ జరగకుండా, మేయర్ పీఠంపై గురితో షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

News January 18, 2026

VZM: యాక్సిడెంట్.. తండ్రి కళ్లెదుటే చిన్నారి మృతి

image

విజయనగరం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిరణ్ కుమార్ తన కుమారుడు, బావ లోకేశ్‌తో కలిసి శ్రీకాకుళం (D) నుంచి విశాఖకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూసపాటి రేగ (M) పేరాపురం నేషనల్ హైవే వద్ద వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిరా ఖనీష్ (6) అక్కడికక్కడే మృతి చెందాడు. తన కళ్లెదుటే కన్నబిడ్డ చనిపోవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. లోకేశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు.