News March 17, 2025

144 సెక్షన్ అమల్లో ఉంటుంది: బాపట్ల ఎస్పీ

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్‌కు అనుమతి లేదని అన్నారు. మాస్ కాపీయింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 17, 2025

శ్రీసత్యసాయి: పదో తరగతి పరీక్షలకు 210 మంది విద్యార్థులు గైర్హాజరు

image

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షలలో మొదటి రోజు పరీక్షలో 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పెనుకొండ డివిజన్‌లో 129 మంది, ధర్మవరం డివిజన్‌లో 81 మంది గైర్హాజరు అయ్యారన్నారు.

News March 17, 2025

సంగారెడ్డి: మొదటి సంవత్సరం పరీక్షకు 96.71% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.71% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.19,938 మంది విద్యార్థులకు గాను 19,282 మంది విద్యార్థులు హాజరయ్యారని, 656 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 17, 2025

అనంత: ప్రజల నుంచి కలెక్టర్ అర్జీల స్వీకరణ

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమస్యల అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!