News March 17, 2025

అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

image

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Similar News

News November 10, 2025

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ జాబ్స్‌కి నోటిఫికేషన్ విడుదల

image

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 09. లైబ్రేరియన్ – 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1, లాబొరేటరీ అసిస్టెంట్ (విద్య) -1, లాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీల్యాబ్) -1, అప్పర్ డివిజన్ క్లర్క్ -1, లైబ్రరీ అటెండెంట్ -2, గ్రూప్ C -1. ఈనెల 30 లాస్ట్‌ డేట్. వివరాలకు https://nsktu.ac.in/ ని సంప్రదించండి.

News November 10, 2025

వెల్దుర్తి: పెద్దపులి దాడిలో రెండు గేదెలు మృతి.?

image

వెల్దుర్తి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వజ్రాలపాడు తండా సమీపంలో పెద్దపులి దాడి ఘటన కలకలం రేపింది. మూఢావత్ తులస్యానాయక్ గేదె శనివారం, మరో గేదె ఆదివారం మృత్యువాత పడ్డాయి. రేంజర్ సుజాత మాట్లాడుతూ.. పశువులను అడవిలోకి పంపవద్దని, రాత్రి వేళ పెట్రోలింగ్ కొనసాగుతోందని చెప్పారు. ట్రాప్ కెమెరాలు, పాదముద్రల ద్వారా పులి కదలికలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

News November 10, 2025

గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్‌లో అమ్మింది 40 కార్లే

image

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్‌లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.