News March 17, 2025
SRPT: తొలగనున్న ఇంటర్ విద్యార్థుల కష్టాలు

JLలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం ఇటీవల నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసింది. కాగా సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్త లెక్చరర్స్ విధుల్లో చేరారు. ప్రభుత్వం జిల్లాకు 14మంది లెక్చరర్స్ను కేటాయించింది. వారిలో 11 మంది ఇప్పటికే ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పటివరకు గెస్ట్ లెక్చరర్లను పెట్టి కాలం వెళ్లదీస్తుండగా రెగ్యులర్ సిబ్బంది రాకతో ఇక నుంచి ఇంటర్ విద్యార్థుల కష్టాలు తొలగిపోనున్నాయి.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
కాకినాడ: ఏపీలోనే తొలిసారిగా.. మన తలుపులమ్మ లోవలో..!

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ ఆలయంలో రూ.4 కోట్లతో ఎస్కలేటర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండప్రాంతం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఎస్కలేటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్న మొదటి దేవాలయం తలుపులమ్మ లోవ కానుంది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<