News March 24, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Similar News
News February 3, 2026
నల్గొండ: చెట్టుపై నుంచి బావిలో పడి కాపరి మృతి

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 3, 2026
NLG: B.P.Ed &D.P.Ed విద్యార్థులకు గమనిక

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News February 3, 2026
NLG: MA హిస్టరీ, టూరిజం పరీక్షల షెడ్యూల్ ఇదే.!

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో MA హిస్టరీ, టూరిజం సెమిస్టర్-1( R-25) సంబంధించిన పరీక్షల టైం టేబుల్ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 10 నుంచి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పూర్తి పరీక్షల టైం టేబుల్కు అధికారిక ఎంజీయూ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.


