News March 17, 2025

జగిత్యాల: జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మల్లాపూర్, అల్లీపూర్‌లో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వెల్గటూర్ 40.8, గొదురు, సిరికొండ, రాఘవపేట, గొల్లపల్లి 40.6, సారంగాపూర్ 40.5, రాయికల్, ఐలాపూర్ 40.3, జైన 40.2, మారేడుపల్లి 40.0, గుల్లకోట 39.9, మెట్‌పల్లి 39.7, జగ్గసాగర్ 39.4, నేరెల్ల 39.3, కథలాపూర్ 39.2, కోరుట్ల, మేడిపల్లిలో 39.1℃ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 17, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.

News March 17, 2025

సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.

News March 17, 2025

పూరీ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమా?

image

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించిందని, సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

error: Content is protected !!