News March 17, 2025
VKB: 100% ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యం: DPO జయసుధ

వికారాబాద్ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన 9.7 కోట్ల రూపాయల ఆస్తిపన్నును 100% వసూలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా పన్నువసూలు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. మార్చ్ 31 నాటికి 100% పన్నులు వసూలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News September 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 14, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.35 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 14, 2025
MLA సోమిరెడ్డిపై కాకాణి ఆరోపణలు

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఆయన పర్యటించారు. ట్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను దోపిడీ చేస్తూ సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.