News March 17, 2025
GNT: ఇన్ఛార్జ్ మేయర్గా ఎవరిని నియమిస్తారు.?

గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా నేపథ్యంలో డిప్యూటీ మేయర్ను ఇన్ఛార్జి మేయర్గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండటం, ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ తరుఫున ఉండటంతో ఈ పదవి ఎవరికి ఇస్తారన్నదీ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ మేయర్గా తొలుత డైమండ్ బాబు నియమితులవ్వగా.. అనంతరం షేక్ సజీల ఎంపికయ్యారు. అయితే సీనియారిటీ ప్రాతిపదికన తమకే అవకాశం ఇవ్వాలని డైమండ్ బాబు గ్రూప్ వాదిస్తోంది.
Similar News
News May 8, 2025
గుంటూరు మిర్చి యార్డ్లో నేటి ధరలివే.!

గుంటూరు మిరప మార్కెట్కు గురువారం 55,000 బస్తాల దిగుబడి నమోదైంది. వివిధ రకాల మిరప ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.80-125, సూపర్ డీలక్స్ రూ.130. భెడిగి రకాలు (355, 2043) రూ.80-120 మధ్య, 341 బెస్ట్ రూ.80-130 మధ్య ట్రేడ్ అయ్యాయి. షార్క్ రకాలు రూ.80-110, సీజెంటా భెడిగి రూ.80-110, నం:5 రకం రూ.90-125 ధరలు పలికాయి. డి.డి రకం రూ.80-115, 273 రకం రూ.90-120, ఆర్ముర్ రకం రూ.75గా విక్రయించబడ్డాయి.
News May 8, 2025
గుంటూరు: తగ్గుతున్న వేసవి బంధాలు

వేసవి వచ్చిందంటే చాలు గతంలో పిల్లలంతా అమ్మమ్మల ఊళ్లకు పయనమయ్యేవారు. పొలాల్లో ఆటలు, తాతయ్యల సరదాలు.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. కానీ, నేటి తరం పిల్లలకు ఆ అనుభూతి అంతగా కలగడం లేదు. గతంలో వేసవి సెలవుల్లో బంధువుల కలయికతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగవుతోంది. తాతయ్యల ఒడిలో కథలు వినడం, అమ్మమ్మల చేతి గోరు ముద్దలు వంటివి అరుదుగా కనిపిస్తున్నాయి. మీకున్న జ్ఞాపకాలు ఎంటో COMMENT చేయండి.
News May 7, 2025
గుంటూరు జిల్లాలో భద్రతా తనిఖీలు

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో బస్టాండ్లు, ఆటో స్టాండ్, మార్కెట్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, సరుకు వివరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.