News March 17, 2025

అలా చేస్తే కఠిన చర్యలే: బాపట్ల డీఈవో

image

టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం తెలిపారు. జిల్లాలో 16,799 మంది విద్యార్థులు నేటి నుంచి మార్చి28వ తేదీ వరకు పరీక్షలు రాయనున్నారన్నారు. అలాగే జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

Similar News

News January 10, 2026

‘నాకు సంబంధం లేదు’.. మరి ఎవరది?

image

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు <<18810168>>అభ్యంతరం<<>>, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు <<18818989>>సంబంధం<<>> లేదని చెబుతున్నా అనుమతులు వస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి ‘రాజాసాబ్’, తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు అనుమతి వచ్చింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనుమతిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఉండగా రేట్ల పెంపు ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారనే చర్చ మొదలైంది.

News January 10, 2026

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ: నిర్మల్ ఎస్పీ

image

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఈ అవకాశాన్ని దొంగలు ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఊరికి వెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు.

News January 10, 2026

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

image

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్‌ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్‌ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.