News March 17, 2025

పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

image

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.  అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు. 

Similar News

News September 16, 2025

నిర్మల్: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

పట్టణంలోని ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రిని కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు సేకరించారు. అనంతరం లాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపి వార్డు, బాలింతల వార్డులను సందర్శించి రోగుల పరిస్థితి స్వయంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

News September 16, 2025

గుండెపోటుతో డోన్ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి

image

డోన్‌ రైల్వే స్టేషన్‌‌లో విషాదం నెలకొంది. ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. సామాజిక సేవలోనూ ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు, సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

WNP: ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

టీజీఎస్ ఆర్టీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బస్సులను బుక్ చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.