News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

Similar News

News March 18, 2025

జనగామ: టెన్త్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News March 18, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌కు మళ్లీ రప్పించారు

image

కామారెడ్డి జిల్లాలో 15మంది తహసిల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో ప్రేమ్ కుమార్‌ను అధికారులు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఇంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే ప్రేమ్ కుమార్ డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి డీఎఓగా పంపగా మళ్లీ అతనినీ అధికారులు కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.

News March 18, 2025

మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

image

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!