News March 17, 2025

విజయవాడ: నకిలీల ఘటనపై స్పందించిన ఏసీపీ

image

నకిలీ పోలీసులు, నకిలీ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. సోమవారం మాచవరం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు, మీడియా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను ఎవరైనా బెదిరిస్తే నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.

Similar News

News March 1, 2026

భూపాలపల్లికి గర్వకారణం.. అక్కాతమ్ముళ్లు!

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన అక్క, తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపారు. డెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య తెలంగాణ నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలవగా, ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లా ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. వీరి విజయంపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News March 1, 2026

అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 5వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

News March 1, 2026

MBNR: ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

image

జిల్లా కేంద్రంలో NTR మహిళ డిగ్రీ కళాశాల నందు జరిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ (5) నెలల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం నాడు ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్ష కు 617 మంది హాజరయ్యారు. వీరిలో మెరిట్ ఆధారంగా 100 మందికి 5 నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో (GROUP1,2,3,&4, SI & PC, RRB, BANKING) ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DD (SCDD)డి.సునీత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు.