News March 17, 2025
ప్రతిపక్ష నేతలకు భట్టి ఫోన్.. అఖిలపక్ష భేటీపై ఆరా

TG: సరైన షెడ్యూల్ లేని కారణంగా పునర్విభజనపై అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. తేదీని ఖరారు చేయడం కోసం ఆరా తీశారు. సాయంత్రం భేటీ అవుదామని కోరగా రాజకీయ పార్టీల నుంచి స్పష్టత రాలేదు.
Similar News
News March 18, 2025
IPL: ఓపెనింగ్ సెర్మనీకి దిశా పటానీ, శ్రద్ధా కపూర్

మరో 5 రోజుల్లో ఐపీఎల్ మహాసంగ్రామానికి తెర లేవనుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్లు దిశా పటానీ, శ్రద్ధా దాస్, సింగర్స్ కరణ్ ఆజ్లా, శ్రేయా ఘోషల్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు టాక్.
News March 18, 2025
యాదగిరి గుట్టకు పాలకమండలి: మంత్రి కొండా సురేఖ

TG: టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆలయానికి పాలకమండలి బోర్డు ఉండేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే బోర్డు స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 60కిలోల బంగారం నిల్వలు ఉన్నాయని, అదే విధంగా రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్నపసిడి నిల్వల సమాచారం తెప్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
News March 18, 2025
EPF నగదు విత్డ్రా మూడు రోజుల్లోనే..!

EPFలో క్లైయిమ్లు ఆటోమోడ్లో 3రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 2కోట్లకు పైగా క్లెయిమ్లు ఆటోమోడ్లోనే జరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమన్నారు. విత్ డ్రా పరిమితి రూ. లక్ష రూపాయలకి పెంచినట్లు పేర్కొన్నారు. త్వరలో EPFనగదు UPIద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం వచ్చే అవకాశం ఉంది.