News March 17, 2025

ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: సీఎం చంద్రబాబు

image

AP: 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల GDPకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత MLAలదే. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం’ అని తెలిపారు.

Similar News

News January 18, 2026

ఆలు లేత, నారు ముదర అవ్వాలి

image

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదరగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.

News January 18, 2026

కాలసర్ప దోష విముక్తికై నేడు ఇలా..

image

జాతకంలో రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే కాలసర్ప దోషం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం, నిరాశ వంటివి ఎదురవుతాయి. చొల్లంగి అమావాస్య పర్వదినం దీనికి సరైన పరిష్కార సమయం. ఓ వెండి నాగుపాము ప్రతిమకు భక్తితో పూజ నిర్వహించి, దానిని ప్రవహించే నదిలో లేదా సముద్ర సంగమ జలాల్లో నిమజ్జనం చేయాలి. ఈ పవిత్ర రోజున ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి, జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.

News January 18, 2026

కాలసర్ప దోష విముక్తికై నేడు ఇలా..

image

జాతకంలో రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే కాలసర్ప దోషం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం, నిరాశ వంటివి ఎదురవుతాయి. చొల్లంగి అమావాస్య పర్వదినం దీనికి సరైన పరిష్కార సమయం. ఓ వెండి నాగుపాము ప్రతిమకు భక్తితో పూజ నిర్వహించి, దానిని ప్రవహించే నదిలో లేదా సముద్ర సంగమ జలాల్లో నిమజ్జనం చేయాలి. ఈ పవిత్ర రోజున ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి, జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.