News March 24, 2024
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు గడువు పొడిగింపు
AP: పేద పిల్లలకు ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు అధికారులు పొడిగించారు. నిన్నటికి 47,082 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సమీపంలోని సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 18004258599 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 3, 2024
నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR
ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.
News October 3, 2024
అమల ట్వీట్కు అక్కినేని అఖిల్ మద్దతు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన <<14257006>>ట్వీట్కు<<>> అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.
News October 3, 2024
మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన హీరో నాని
చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.