News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 18, 2025
నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

మన రాష్ట్రాన్ని నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. మంగళవారం తిరువూరులో నాటు సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సారా నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ కల్పన కల్పిస్తామని అన్నారు. చదువులేని వారికి ఎంచుకున్న ఉపాధి తప్పనిసరిగా అందిస్తామని పేర్కొన్నారు.
News March 18, 2025
ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?
News March 18, 2025
బాపట్ల: ‘ఎండల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయమ్మ తెలిపారు. మంగళవారం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో గొడుగు వినియోగించాలన్నారు. మంచి నీరు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలన్నారు.