News March 17, 2025
జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్కు బెయిల్

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రేవతి, తన్వీ యాదవ్లకు బెయిల్ మంజూరు చేసింది. వారిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
Similar News
News December 31, 2025
HYD: రాత్రి 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో కఠిన భద్రతా చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని CP సజ్జనార్ స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు తప్పదని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతతో కొత్త ఏడాదిని జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News December 31, 2025
31st నైట్ HYDలో ఈ రూట్లు బంద్

New Year వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, PV మార్గ్, పలు ఫ్లైఓవర్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
News December 31, 2025
HYD: ఈ చేపలు తింటే ముప్పు

మేడ్చల్ (D) ఎదులాబాద్ నీటి రిజర్వాయర్ కాలుష్యంతో తీవ్రంగా కలుషితమవుతోంది. ఇందులోని చేపలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. తక్కువ ధర, అధిక ప్రోటీన్ అనే కారణాలతో ప్రజలు విస్తృతంగా తినే పొలుసులు చేపల్లో విషం దాగి ఉంది. సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం వంటి భార లోహాలు పేరుకుపోయినట్లు TG SSC జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. దీర్ఘ కాలంలో కాలేయం, కిడ్నీ, నరాలపై ప్రభావం చూపనుంది.


