News March 17, 2025
ములుగు: ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 19 ఫిర్యాదులు సమర్పించారని ఆయన తెలిపారు. భూసమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగ ఉపాధి, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు.
Similar News
News March 18, 2025
ఖమ్మంలో దూసుకెళ్తున్న LRS ఆదాయం

ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో LRS ఆదాయం దూసుకెళ్తుంది. రోజుకు 70 నుంచి 80 దరఖాస్తులకు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 1,895 దరఖాస్తులకు చెల్లింపులు జరగగా.. రూ. 10.61 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది
News March 18, 2025
ఎచ్చెర్లలో దారుణ హత్య

ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమ్మ (40) ను భర్త అప్పలనాయుడు కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హత్యకు కుటుంబంలో గొడవలే కారణమని సమాచారం.
News March 18, 2025
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.