News March 17, 2025

JNTUA 14వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి 2023-24 మధ్య కాలంలో యూజీ (లేదా) పీజీ (లేదా) పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారు తమ ఒరిజినల్ డిగ్రీలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు https://jntuaebranchpayment.in/originaldegree/ ను సందర్శించాలని సూచించారు.

Similar News

News March 18, 2025

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

image

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు. ☛ 18న సింహ వాహనం ☛ 19న శేష వాహనం ☛ 20న హనుమంత వాహనం☛ 21న గరుడ వాహనం☛ 22న కళ్యాణోత్సవం☛ 23న రథోత్సవం☛ 24న అశ్వ వాహనం☛ 25న వసంతోత్సవం, హంస వాహనం☛ 26న ఏకాంతోత్సవం

News March 18, 2025

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకం: ఎస్పీ

image

సైబర్‌ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకమని జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్, ఇతర నేరాలలో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌పై వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్ నుండీ వచ్చిన సైబర్ ఎక్స్పర్ట్ రామాంజినేయులచే సైబర్ నేరాల శోధనలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కేసు ఛేదనలో ప్రతీ అంశాన్ని కీలకంగా తీసుకోవాలన్నారు.

News March 18, 2025

మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

image

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!