News March 17, 2025
పదేళ్లలో రూ.16.35లక్షల కోట్లు రైటాఫ్: కేంద్రం

గత పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించారు. అత్యధికంగా 2018-19FYలో రూ.2.36లక్షల కోట్లను, అత్యల్పంగా 2014-15లో రూ.58,786 కోట్ల బాకీలను రద్దు చేసినట్లు తెలిపారు. రైటాఫ్ చేయడమంటే రుణగ్రహీతలకు ఊరటనిచ్చినట్లు కాదని, వివిధ మార్గాల్లో వాటిని బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని స్పష్టం చేశారు.
Similar News
News March 18, 2025
యాదగిరి గుట్టకు పాలకమండలి: మంత్రి కొండా సురేఖ

TG: టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆలయానికి పాలకమండలి బోర్డు ఉండేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే బోర్డు స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 60కిలోల బంగారం నిల్వలు ఉన్నాయని, అదే విధంగా రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్నపసిడి నిల్వల సమాచారం తెప్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
News March 18, 2025
EPF నగదు విత్డ్రా మూడు రోజుల్లోనే..!

EPFలో క్లైయిమ్లు ఆటోమోడ్లో 3రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 2కోట్లకు పైగా క్లెయిమ్లు ఆటోమోడ్లోనే జరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమన్నారు. విత్ డ్రా పరిమితి రూ. లక్ష రూపాయలకి పెంచినట్లు పేర్కొన్నారు. త్వరలో EPFనగదు UPIద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం వచ్చే అవకాశం ఉంది.
News March 18, 2025
రచయిత మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాజమౌళి

మలయాళ రచయిత గోపాలకృష్ణన్ మృతిపై దర్శకుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త బాధించిందని ఆత్మకు శాంతికలగాలని Xలో ఫోస్ట్ చేశారు. ‘ఈగ’ ‘బాహుబలి’ ‘RRR’ చిత్రాల మలయాళ వెర్షన్కు గోపాలకృష్ణ పనిచేశారు.