News March 17, 2025
ఆదిలాబాద్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి K.ప్రభాకర్ రావు, అదనపు డిస్ట్రిక్ట్ సెక్షన్స్ జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు. రానున్న లోక్ అదాలత్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.
Similar News
News March 18, 2025
12 నుంచి 4 వరకు బయటకు రావొద్దు : ADB కలెక్టర్

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావాలని సూచించారు. బయటకు వెళితే వెళ్లినప్పుడు తలపై టోపీ పెట్టుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ 4 నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News March 18, 2025
ADB: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

ఈనెల 18 నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు ప్రతిరోజు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రెండు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజు మధ్యాహ్నం 3, రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతాయన్నారు. తిరుగుప్రయాణంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 5 గంటలకు, 11:30 గంటలకు బస్ ఉంటుందన్నారు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 18, 2025
ADB: పోలీసులను బెదిరించిన మహిళపై కేసు: CI

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.