News March 17, 2025

ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ప్ర‌శాంతంగా సాగాయి. రిజిస్ట‌ర్ అయిన 27,711 మంది రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు గాను 27,443 మంది హాజ‌ర‌య్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థుల‌కు 39 మంది హాజ‌రైన‌ట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశామన్నారు. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా అధికారులకు సూచ‌న‌లు చేసినట్లు పేర్కొన్నారు. 

Similar News

News November 14, 2025

రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

image

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్‌లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.

News November 14, 2025

PDPL: సబ్ రిజిష్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

పెద్దపల్లి జిల్లా సబ్ రిజిష్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ విజయ కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిష్టర్ కార్యాలయాల్లో అవినీతి నిర్ములించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి సబ్ రిజిష్టర్ కార్యాలయంలో పలు రికార్డులను, డాక్యుమెంట్లు, ఇతర పాత్రలను పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను సైతం విచారిస్తున్నారు.

News November 14, 2025

పోలీసులు అలెర్ట్‌గా ఉండాలి: ఎస్పీ

image

ఢిల్లీ పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బందితో వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఉండే సున్నితమైన ప్రాంతాల‌పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.