News March 17, 2025
ఉప్పలగుప్తం కాలువలో మృతదేహం లభ్యం

ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామం పరిధి అమలాపురం నుంచి చల్లపల్లి గ్రామం వైపు వెళ్లే పంట కాలువలో మృతదేహం కొట్టుకొచ్చింది. సుమారు 50 నుంచి 55 సంవత్సరములు గల గుర్తుతెలియని మగ మృతదేహం ఉప్పలగుప్తం పోలీసు గుర్తించారు. సదరు మృతదేహంను సరిపల్లె విఆర్ఓకీ ఉప్పలగుప్తం ఎస్ఐకి ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 4, 2025
సంగారెడ్డి: ‘లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి’

ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్లో కక్షిదారులు తమ బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ఫండ్స్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. సంగారెడ్డి కోర్టులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
News November 4, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.
News November 4, 2025
సంగారెడ్డి: ఉన్నత చదువులు.. 30 మంది టీచర్లకు అనుమతి

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 30 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


