News March 17, 2025

తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

image

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.

Similar News

News October 17, 2025

సిరిసిల్ల: సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్

image

సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై IKP సెంటర్ల బాధ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం గ్రే ఏడు రకానికి రూ.2389, కామన్ రకానికి రూ.2369 ధరను ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యం క్వింటాలకు అదనంగా రూ.500 ప్రభుత్వం ఇస్తుందన్నారు.

News October 17, 2025

చిత్తూరు: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

image

తెలంగాణ(S) కామారెడ్డి(D) నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News October 17, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.6,800

image

జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర శుక్రవారం రూ.6,800 పలికింది. ఈరోజు మార్కెట్‌కు రైతులు 159 వాహనాల్లో 1238 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. రూ.5,000, నుంచి రూ.6,800 దాకా పలికింది. గోనె సంచుల్లో 31 మంది రైతులు 43 క్వింటాలు తీసుకురాగా.. రూ.4,800, నుంచి రూ.6,000 దాకా పలికింది. రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.