News March 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 18, 2025
తిరుపతిలో ధర్నా.. బీసీవై పార్టీ చీఫ్పై కేసు

AP: తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా <<15787478>>సాధువులతో కలిసి ధర్నా<<>> చేసిన బీసీవై(భారత చైతన్య యువజన) పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై FIR నమోదైంది.
News March 18, 2025
ఒంటి పూట బడుల సమయం మార్పు

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
News March 18, 2025
శశాంక్ సింగ్ IPL ఆల్ టైమ్ ఎలెవన్.. కెప్టెన్ ఎవరంటే?

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్ IPLలో తన ఆల్ టైమ్ ఎలెవన్ టీమ్ను ప్రకటించారు. గత 17 సీజన్లలో సత్తా చాటిన ప్లేయర్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. టీమ్ కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంచుకోగా విదేశీ ప్లేయర్ల కేటగిరీలో డివిలియర్స్, మలింగను ఎంపిక చేశారు.
జట్టు: సచిన్, రోహిత్ శర్మ(C), కోహ్లీ, సురేశ్ రైనా, డివిలియర్స్, ధోనీ, హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, బుమ్రా, మలింగ.
మీ టీమ్ కామెంట్?