News March 17, 2025

నంద్యాల కలెక్టరేట్‌కు 209 అర్జీల రాక

image

నంద్యాల కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. మొత్తంగా 209 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. 

Similar News

News March 18, 2025

తిరుపతిలో ధర్నా.. బీసీవై పార్టీ చీఫ్‌పై కేసు

image

AP: తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా <<15787478>>సాధువులతో కలిసి ధర్నా<<>> చేసిన బీసీవై(భారత చైతన్య యువజన) పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్‌పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై FIR నమోదైంది.

News March 18, 2025

NZSR: హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపికైన వెన్నెల

image

టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికయ్యింది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180/300 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు.

News March 18, 2025

ఒంటి పూట బడుల సమయం మార్పు

image

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.

error: Content is protected !!