News March 17, 2025
ఈ సమయంలో పండ్లు తింటున్నారా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినడం ఎంతో అవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఆస్వాదించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపుతో అస్సలు తినకూడదు. అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్లో అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వీటిని తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. పడుకునే ముందు తీసుకోకూడదు. అజీర్తి సమస్యలు వస్తాయి. డెయిరీ పదార్థాలతో కలిపి వీటిని తినకూడదు.
Similar News
News January 26, 2026
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం?

మన దేశానికి 1947 AUG 15నే స్వాతంత్ర్యం సిద్ధించినా 1950 JAN 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటివరకు ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం-1935 రద్దయింది. దీంతో భారత్ సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఈ రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. 1949 NOV 26నే రాజ్యాంగ రచన పూర్తయినా కొన్ని సర్దుబాట్లతో 2 నెలలు ఆలస్యంగా JAN 26న అమల్లోకి తెచ్చారు.
News January 26, 2026
చలికాలంలో కోడి పిల్లల మరణాలు తగ్గాలంటే..

చలికాలంలో కోడి పిల్లల మరణాలు తగ్గాలంటే బ్రూడింగ్ ముఖ్యం. దీని కోసం 200 వాట్ల విద్యుత్ బల్బులను 100 కోడి పిల్లలకు ఒకటి చొప్పున షెడ్లో ఏర్పాటు చేసుకోవాలి. ఫారమ్ చుట్టూ టార్పాలిన్ కవర్లను కప్పి షెడ్ లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 32-35 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి. షెడ్లో కింద 2 అంగుళాల మేర పొట్టు వేసుకొని దానిపై న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఈ చర్యల వల్ల కోడి పిల్లల మరణాలు చాలా వరకు తగ్గుతాయి.
News January 26, 2026
నేడు భీష్ముడికి తర్పణం సమర్పిస్తే..?

భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి లేదా తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్మృతి కౌస్తుభం చెబుతోంది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, లోకమంతా ఆయనకు సంతానమేనని శాస్త్ర వచనం. అందుకే తండ్రి బతికున్న వారు కూడా ఈ రోజున ఆయనకు తర్పణం ఇవ్వవచ్చు. ‘వైయాఘ్య్రపద గోత్రాయ’ అనే శ్లోకం పఠిస్తూ నీటిని వదలడం వల్ల సంవత్సర కాలం పాటు చేసిన పాపాలు నశిస్తాయని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.


