News March 17, 2025

సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.

Similar News

News March 18, 2025

VZM: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. వేపాడ మండలం డబ్బిరాజు పేటకు చెందిన రామ్‌కుమార్ బొత్సవాని పాలెంలోని బెల్లం క్రషర్‌ వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సామగ్రిని వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో రామ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాడంగి సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News March 18, 2025

ఖమ్మంలో దూసుకెళ్తున్న LRS ఆదాయం

image

ఎల్ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో LRS ఆదాయం దూసుకెళ్తుంది. రోజుకు 70 నుంచి 80 దరఖాస్తులకు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 1,895 దరఖాస్తులకు చెల్లింపులు జరగగా.. రూ. 10.61 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది

News March 18, 2025

ఎచ్చెర్లలో దారుణ హత్య

image

ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమ్మ (40) ను భర్త అప్పలనాయుడు కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హత్యకు కుటుంబంలో గొడవలే కారణమని సమాచారం.

error: Content is protected !!