News March 17, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.
Similar News
News March 18, 2025
మెదక్: బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని హవేలీఘనపూర్ గురుకులం ప్రిన్సిపల్ విజయనిర్మల తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2 లక్షల ఆదాయ పరిమితి మించరాదని వివరించారు.
News March 18, 2025
మెదక్: దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు.
News March 18, 2025
మెదక్: దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు.