News March 17, 2025

బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పదవ తరగతి పరీక్షలు బాపట్ల జిల్లాలో మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 103 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16481 మంది విద్యార్థులకు గాను 16247 మంది విద్యార్థులు హాజరయ్యారు. 234 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా పర్యవేక్షణ అధికారిణి మతి గంగాభవాని తెలిపారు. మొత్తం పరీక్షలకు 98.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

Similar News

News July 6, 2025

కరీమాబాద్‌లో కనుల పండువగా బీరన్న బోనాలు

image

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కురుమల కుల దైవం బీరన్న బోనాల కనుల పండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తారు. బీరప్ప సంప్రదాయంగా గావు పట్టగా బోనాలు బీరన్న గుడికి చేరుకున్నాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తిరుగుముఖం పట్టారు. మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

News July 6, 2025

గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

image

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.

News July 6, 2025

శ్రీశైలం డ్యాంకు భారీగా వరద

image

కృష్ణనది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా గతంలో ఎన్నడు లేని విధంగా మే నెల నుంచే శ్రీశైలం జలాశయానికి వరద నీటి చేరిక ప్రారంభమైంది. దీంతో డ్యాం వేగంగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతోంది. ప్రస్తుతం జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 1,71,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. డ్యామ్ నీటిమట్టం 878.40 అడుగులుగా నమోదైంది.