News March 17, 2025

మంచిర్యాల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

image

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నస్పూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో పాటు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు సోమవారం HYDలో డీజీపీ జితేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.

Similar News

News January 14, 2026

జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

image

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.

News January 14, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుతూ వస్తోంది. బుధవారం ఉదయం వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 13.2℃, జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం 13.3℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం 14.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 14.5℃గా నమోదయ్యాయి.

News January 14, 2026

HYD: నూతన సర్పంచ్‌లకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వం నూతన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘానికి చెందిన గ్రామపంచాయతీల పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.2,500 కోట్ల నిధుల్లో ఈ నెలాఖరులోపు కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయనుండగా, మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. నిధుల వినియోగంపై మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ చర్యలు ప్రారంభించింది.