News March 17, 2025

రాష్ట్రపతి అల్పాహార విందులో బైరెడ్డి శబరి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతికి నమస్కారం చేశారు. రాష్ట్రపతి ఆహ్వానాన్ని ఎంతో గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాని శబరి తెలిపారు.

Similar News

News March 18, 2025

ఒంటి పూట బడుల సమయం మార్పు

image

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.

News March 18, 2025

కడప జిల్లాకు మరోసారి పేరు మార్పు

image

ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ‘కడప’ పేరు మరోసారి మారింది. ఇక నుంచి YSR కడప జిల్లాగా పరిగణించాలని కూటమి ప్రభుత్వం కేబినేట్‌ భేటీలో నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా అయిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో కడపను తొలగించి YSR జిల్లాగా మార్చారు. కడపను మళ్లీ కలిపి YSR కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోమారు జిల్లా పేరు మార్పుపై మీ కామెంట్ తెలపండి.

News March 18, 2025

చిత్తూరు: పాఠశాల పని వేళల్లో మార్పు

image

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పని వేళలను మార్పు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు పాఠశాలలు నడపాలని గతంలో ఇచ్చిన ఉత్తర్లను మార్పు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 5 వరకు పని వేళలను మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పని వేళల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.

error: Content is protected !!