News March 18, 2025

నస్పూర్: ‘10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

జిల్లాలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని మంచిర్యాల కలక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9,189 మంది రెగ్యులర్, 221 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.

Similar News

News November 4, 2025

మేడ్చల్: చేప పిల్లల విడుదలపై కలెక్టర్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

image

పారదర్శకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల విడుదల కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై మంత్రి కలెక్టర్లతో మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులు పాల్గొన్నారు.

News November 4, 2025

TODAY HEADLINES

image

* చేవెళ్లలో RTC బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి.. రూ.7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
* ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్
* లండన్‌లో CM CBNతో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ.. రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఓకే
* CII సమ్మిట్‌లో రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు.. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి లోకేశ్
* WWC: ప్లేయర్లకు డైమండ్​ నెక్లెస్​ల బహుమతి

News November 4, 2025

GHMC పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు

image

జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాప్రా GHMC కార్యాలయంలో నమోదైంది. షేక్‌పేట్ గౌతమ్‌నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 4.5 మిల్లీమీటర్లు, బాలానగర్ ఓల్డ్ సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. రేపు సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.