News March 18, 2025
బెల్లంపల్లి: KU డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి: శంకర్

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ శంకర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోఆర్డినేటర్ MD.రఫీ తెలిపారు. కళాశాలలో BA, Bcom, Bscచదువుతున్న 2వ,4వ,6వ సెమిస్టర్ విద్యార్థులు ఈ మేరకు నిర్ణయించిన ఫీజులు ఆన్ లైన్లో చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు కాకతీయ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించిందన్నారు.
Similar News
News January 8, 2026
బంగ్లాదేశ్లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

బంగ్లాదేశ్లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.
News January 8, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్లు వాపు వస్తున్నాయా?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 8, 2026
ADB: మున్సిపల్ ముసాయిదాలో ‘ఓట్ల’ గందరగోళం

పురపాలక సంఘాలతో పాటు ఎంఎన్సిఆర్ఎల్ (MNCRL) కార్పొరేషన్లో ప్రకటించిన ముసాయిదాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం, కొత్త ఓటర్ల నమోదులో నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.


