News March 18, 2025
సిద్దిపేట: సమస్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
ఆదిలాబాద్: ప్రొవిజినల్ జాబితా విడుదల

ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో నియామకం కోసం సపోర్టు ఇంజనీరు ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జాబితాను జిల్లా కార్యాలయ నోటీసు బోర్డుతో పాటు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాలో ఏమైనా సవరణలు, మార్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఈ నెల 10 వరకు సంబంధిత సర్టిఫికెట్లతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News November 4, 2025
ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.
News November 4, 2025
చిన్నారి వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

AP: 2010 జనవరి 30న VJAలో అపహరణ, హత్యకు గురైన చిన్నారి వైష్ణవి కేసులో శిక్ష రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్లోని బాయిలర్లో వేసి బూడిద చేశారు.


