News March 18, 2025
భువనగిరి: కలెక్టరేట్ వద్ద మహిళల బస

భువనగిరి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్, సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యను పరిష్కరించాలని 48 గంటల పాటు మహాధర్నా చేస్తున్నారు. నిరసనలో భాగంగా వంట వార్పు చేసుకుని రాత్రి అక్కడే బస చేశారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చుట్టూ పరదాలు కట్టుకొని అక్కడే తిని పడుకున్నారు. ఈ ధర్నా రేపు కూడా ఉంటుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.
Similar News
News September 15, 2025
HYD: తెలుగు వర్సిటీ.. ఎల్లుండి నుంచి క్రీడా పండుగ

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో బోధన, బోధనేతర, విద్యార్థులకు ఈనెల 17 నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం వర్సిటీ VC ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు క్రీడా పోస్టర్ను రిలీజ్ చేశారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ R.గోపాల్ పాల్గొన్నారు.
News September 15, 2025
సెప్టెంబర్ 17న స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం: కలెక్టర్

జనగామలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం AAM/PHC/CHC/GGHలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా ఆరోగ్య శిబిరాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 17న MCH చంపక్ హిల్స్లో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
News September 15, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.