News March 18, 2025

సూర్యాపేట: పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు స్క్వాడ్ విధులు 

image

మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్‌గా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులకి విధులు కేటాయించామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు అందరూ తప్పకుండా పరీక్ష విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వీవీ.అప్పారావు, డీఎంహెచ్‌వో కోటాచలం, డీఈవో అశోక్ ఉన్నారు.

Similar News

News January 16, 2026

ప్రజల్లో మమేకమై పనిచేయాలి: ఎంపీ రఘునందన్

image

బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పని చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సిద్దిపేట నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. MP మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తొడుపునూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

News January 16, 2026

వేములవాడ: జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను రూ. కోటితో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు.

News January 16, 2026

YTలో పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించవచ్చు!

image

పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూడకుండా పూర్తిగా బ్లాక్ చేయడం లేదా టైమ్ ఫిక్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు కిడ్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేసింది.