News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్ (48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికిరాలేదని తన కుమారుడు చేన్లోకి వెళ్లి చూడగా కరెంట్ షాక్కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News January 16, 2026
హైదరాబాద్లో AQ @222

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.
News January 16, 2026
నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10:30కి సీఎం నివాసం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్కు బయలుదేరనున్నారు. చనాక కొరటా పంప్ హౌస్ ప్రారంభించి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొని, అనంతరం నిర్మల్ జిల్లాకు వెళ్లి సదర్మట్ బ్యారేజీ ప్రారంభించి నీటిని విడుదల చేసిన తర్వాత నిర్మల్ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
News January 16, 2026
హైదరాబాద్లో AQ @222

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.


