News March 18, 2025
సిద్దిపేట: యువకుడి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకి మండలంలో జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాలు.. మండలంలోని నరసింహులపల్లికి చెందిన కుసుంబ సాయి (22) కడుపునొప్పి భరించలేక సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. మృతుని తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 18, 2025
పానగల్: విద్యార్థులు పెద్ద కలలు కనండి: జిల్లా ఎస్పీ

పానగల్ మండలం మహమ్మదాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం,10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ హాజరయ్యారు. పాఠశాల జీహెచ్ఎం ఆనంద్,ఉపాధ్యాయ బృందం, మాజీ సర్పంచ్ జయరాములు సాగర్ వారికి స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాధించాలన్నారు.
News March 18, 2025
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.
News March 18, 2025
HYD: సీఎంను కలిసిన బీసీ సంఘాల నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.